బల్లీ పకోడీ చూశారా? ప్యాకెట్‌ను ఓపెన్ చేసి చూస్తే.. చచ్చిన బల్లి?

శనివారం, 26 మే 2018 (12:05 IST)
ఆనియన్ పకోడీ టేస్ట్ చేసివుంటాం. అయితే బల్లీ పకోడీ చూశారా? అబ్బే యాక్ అంటున్నారు.. కదూ.. అవును.. అదే జరిగింది.. హైదరాబాదులోని రామంతాపూర్‌లో. వివరాల్లోకి వెళితే, పల్లీ పకోడీ తిందామని ప్యాకెట్ ఓపెన్ చేస్తే.. అందులో చచ్చిపోయిన బల్లి కనిపించడంతో కస్టమర్ ఆ కవర్ కిందపడేసి వాంతులు చేసుకున్నాడు. 
 
దూరదర్శన్ కేంద్రం ఎదురుగా ఉన్న శ్రీసాయి గణేష్ హోటల్, చిప్స్ దుకాణంలో రంజిత్ సింగ్ అనే వ్యక్తి పల్లీ పకోడీల ప్యాకెట్‌ని శుక్రవారం కొనుగోలు చేశాడు. తిందామని ఆ ప్యాకెట్ విప్పగా చచ్చిన బల్లి ఉంది. ఈ విషయమై ఫిర్యాదు చేసేందుకు షాపుకెళ్తే.. నిర్వాహకులు రంజిత్ సింగ్‌ మాటలను పట్టించుకోలేదు. అంతే ఇక బాధిత వినియోగదారుడు అధికారులకు ఫిర్యాదు చేశాడు. 
 
ఆ దుకాణాన్ని సీజ్ చేయాలని డిమాండ్ చేశాడు. ఈ సమాచారం మేరకు అక్కడికి వెళ్లిన శానిటేషన్ అధికారులు ఆ దుకాణాన్ని పరిశీలించారు. ఆ షాపులో తినుబండారాల ప్యాకెట్లపై తయారీ తేదీలు లేకపోవడాన్ని గమనించారు. షాపు యజమానికి రూ.5 వేల జరిమానా విధించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు