ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త ప్రకటించింది. జనరల్ లైఫ్ ఇన్సూరెన్స్ (జీఎల్ఐ), జనరల్ ప్రావిడెంట్ ఫండ్ (జీపీఎఫ్)కు సంబంధించిన పెండింగ్ బకాయిలలో రూ.6,200 కోట్లను సంకీర్ణ ప్రభుత్వం విడుదల చేసింది. ఈ నిధులను నేరుగా ఉద్యోగుల బ్యాంకు ఖాతాలకు జమ చేస్తున్నారు.