ఏపీలో 4 రోజుల పాటు వడగళ్ల వర్షం ... ఈదురు గాలులు వీచే అవకాశం... ఐఎండీ

ఠాగూర్

సోమవారం, 24 మార్చి 2025 (13:10 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో అకాల వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఇప్పటికే పలు ప్రాంతాల్లో క్యుములోనింబస్ మేఘాల కారణంగా పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాలు మరో నాలుగు రోజుల పాటు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆ సమయంలో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. విదర్భం నుంచి తమిళనాడు వరకు ఉపరితల ఆవర్తనం నెలకొనివుందని తెలిపింది. 
 
మరోవైపు, ఈ అకాల వర్షాలతో పంటలు తీవ్రంగా దెబ్బతింటున్నాయి. దీంతో చేతికి అందివచ్చిన పంట నాశనం కావడంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు, మరో నాలుగు రోజుల పాటు ఇదే పరిస్థితి ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. మరో నాలుగు రోజుల పాటు అకాల వర్షాలు కురుస్తాయని, వడగళ్ల వాన కురుస్తుందని, ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. 
 
క్యుమునోనింబస్ మేఘాల కారణంగా పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. దీనికితోడు విదర్భం నుంచి తమిళనాడు వరకు ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉంది, సముద్రమట్టానికి 1.5 కిలోమటీర్ల ఎత్తులో ఆవర్తనం కొనసాగుతోందని వెల్లడించింది. పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్న తరుణంలో వర్షాలు కురిసే సమయంలో చెట్లకు దూరంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు