అండగా ఉంటానని అందాలను దోచుకున్నాడు.. ఇపుడు నగ్నంగా నిలబెట్టాడు...

శనివారం, 30 జూన్ 2018 (11:36 IST)
ఇటీవల హైదరాబాద్‌లో ఓ పబ్‌లో బ్లేడ్‌ దాడికి గురైన బాధితురాలు షేక్ సమీర. ఈమె తనకు జరిగిన అన్యాయంపై పోలీసులకు చెప్పినా వారు స్పందించలేదు. దీంతో మీడియా ముందుకు వచ్చింది. తనకు అండగా ఉంటానని చెప్పి తన అందాలను జుర్రుకున్న తన మాజీ ప్రియుడు.. ఇపుడు మరో యువతితో కలిసి తనపై బ్లేడ్‌తో దాడి చేయించి రోడ్డుపై నగ్నంగా నిలబెట్టాడని ఆరోపించింది.
 
గుంటూరు జిల్లాకు చెందిన షేక్ సమీరా అనే యువతి టీవీల్లో నటిస్తూ, దుబాయ్‌లో ఉద్యోగం చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. ఈమెకు ఫిరోజ్ ఖాన్ అనే వ్యక్తి పరిచయమయ్యాడు. తర్వాత వీరిద్దరూ కొంతకాలం ప్రేమించుకున్నారు. అనంతరం అండగా ఉంటానని చెప్పి శారీరకంగా దగ్గరయ్యారు. 
 
ముఖ్యంగా, టీవీ సీరియల్స్‌లో అవకాశాలు ఇప్పిస్తానని ఫిరోజ్ దారుణంగా మోసం చేశాడని, మనస్పర్థలు వచ్చి తామిద్దరం విడిపోయామని షేక్ సమీరా వాపోతోంది. ఆ తర్వాత కీర్తితో ఫిరోజ్ పరిచయం పెంచుకున్నాడని, తన చేతులపై బ్లేడుతో ఫిరోజ్ ఖాన్ ప్రియురాలు కీర్తిరెడ్డే గాట్లు పెట్టిందని చెబుతూ వాటిని మీడియాకు చూపింది. 
 
పైగా, తనను గంటపాటు అర్థనగ్నంగా రోడ్డుపై నిలబెట్టారని, తననుంచి లక్షన్నర విలువ చేసే వాచీ, రెండు సెల్ ఫోన్లను లాక్కెళ్లారని వాపోయింది. పోలీసులు ఇంతవరకూ వారిని అరెస్ట్ చేయలేదని, తన పలుకుబడితో పోలీసులను ఫిరోజ్ మేనేజ్ చేస్తున్నాడని ఆరోపించింది. ఇప్పటికీ తనను హత్య చేసేందుకు ప్రయత్నిస్తున్నారని చెబుతూ, ఫిరోజ్‌కు, తనకు మధ్య జరిగిన ఫోన్ సంభాషణల రికార్డును వినిపించింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు