ఏపీలో పాఠశాల విద్యార్థులకు ఉచితంగా ట్యాబ్స్ పంపిణీ

బుధవారం, 21 డిశెంబరు 2022 (11:30 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన పుట్టిన రోజు వేడుకలను బుధవారం జరుపుకుంటున్నారు. దీన్ని పురస్కరించుకుని ఏపీలోని విద్యార్థులకు శుభవార్త చెప్పింది. ఎనిమిదో తరగతి చదివే విద్యార్థులకు ట్యాబ్‌లు పంపిణీ చేస్తున్నారు. సీఎం జగన్ పుట్టిన రోజు సందర్భంగా డిసెంబరు 21వ తేదీ నుంచి అధికారంకా ఈ ట్యాబ్స్ పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుడుతారు. 
 
ఈ నెల 28వ తేదీ నుంచి రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 4,59,64,000 మంది ఎనిమిదో తరగతి చదివే విద్యార్థులకు ఈ ట్యాబ్స్‌ను ఉచితంగా పంపిణీ చేస్తారు. వీరితో పాటు 59176 మంది ఉపాధ్యాయులకు కూడా వీటిని అందజేస్తారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం ఈ నెల 17వ తేదీన ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెల్సిందే. ఇదిలావుంటే, ఈ ట్యాబ్స్ పంపిణీ కోసం సీఎం జగన్ బుధవారం ఉమ్మడి ఒంగోలు జిల్లాలోని బాపట్ల, యడ్లపల్లిలో జరిగే కార్యక్రమంలో పాల్గొని ఈ ట్యాబ్స్‌ను పంపిణీ చేస్తారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు