జనసేనానికి రూ.వెయ్యి కోట్ల ఆఫర్ చేసిన కేఏ పాల్

మంగళవారం, 7 జూన్ 2022 (14:11 IST)
సినీ నటుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌కు ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ బంపర్ ఆఫర్ ప్రకటించారు. పవన్ కళ్యాణ్ తన సొంత పార్టీ జనసేనను వదిలిపెట్టి తన పార్టీలో చేరితే వెయ్యి కోట్ల రూపాయలను ఇస్తామని తెలిపారు. అలాగే, పవన్‌ను ఎంపీగానే, ఎమ్మెల్యేగానో గెలిపిస్తానని తెలిపారు. 
 
ఒకవేళ గెలిపించుకోలేకపోతే ఆయనకు వెయ్యి కోట్ల రూపాయలు ఇస్తానని ఆయన తెలిపారు. అదేసమయంలో వచ్చే ఎన్నికల్లో పవన్ సొంతగా పోటీ చేసినా లేక ఇతర పార్టీలతో పెట్టుకుని పోటీ చేసినా ఓడిపోవడం ఖాయమని కేఏ పాల్ జోస్యం చెప్పారు. 
 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు