ఉక్రెయిన్‌పై రష్యా వార్.. పుతిన్ మెంటలోడు.. 21 రోజులు నిరాహార దీక్ష

శనివారం, 26 ఫిబ్రవరి 2022 (16:59 IST)
ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధానికి దిగడంపై కేఏ పాల్ స్పందించారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ మెంటలోడని, ఆయన సర్వనాశనం చేస్తాడని.. తాను ముందే ఊహించానన్నారు. 
 
ఈ యుద్ధం నిలువరించేందుకు చాలా రోజుల నుంచి ప్రయత్నాలు చేస్తున్నానని, 21 రోజులుగా తాను నిరాహార దీక్ష చేస్తున్నానని తెలిపారు. 
 
గత నెలలోనే అమెరికా అధ్యక్షుడు బైడెన్ ను తమ బలగాలు ఉక్రెయిన్ కు పంపాలని చెప్పానని, కానీ ఆయన ఓకే చెప్పి కూడా ఆ పని చేయలేదని మండిపడ్డారు. బైడెన్‌కు కళ్లు నెత్తికెక్కాయన్నారు. 
 
యుద్ధాన్ని ఆపాల్సిన ఐక్య రాజ్య సమితి సెక్రెటరీ జనరల్ గుటెరస్ ఇది పెద్ద సీరియస్ మేటర్ కాదన్నట్లుగా మాట్లాడారని, ఆయన బుర్ర పనిచేయడం లేదని, తక్షణం రాజీనామా చేయాలని కేఏ పాల్ డిమాండ్ చేశారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు