పవన్ చేతులు మీదుగా జనసేన కండువాలు కప్పుకున్న ఆ ముగ్గురు నేతలు (video)

సెల్వి

గురువారం, 26 సెప్టెంబరు 2024 (20:13 IST)
Pawan kalyan
వైసీపీని ఇటీవల వీడిన ముగ్గురు కీలక నేతలు గురువారం జనసేన పార్టీలో చేరారు. వీరికి ఆ పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. 
 
మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు సామినేని ఉదయభాను, కిలారి రోశయ్య జనసేనలో చేరారు. విజయనగరం జిల్లా నుంచి అవనపు విక్రమ్ దంపతులు కూడా జనసేన కండువా కప్పుకున్నారు. 
 
నాయ‌కులతో పాటు వారి వెంట వచ్చిన కార్యకర్తలతో మంగళగిరి వద్ద ఉన్న జ‌న‌సేన కార్యాల‌యం వ‌ద్ద కోలాహ‌లం కనిపించింది. ఇటీవలే వైసీపీకి మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డితో పాటు సామినేని ఉదయభాను, కిలారి రోశయ్య కూడా వైసీపీకి రాజీనామా చేశారు.
 
ఈ నాయ‌కులతో పాటు వారి వెంట వచ్చిన కార్యకర్తలతో మంగళగిరి వద్ద ఉన్న జ‌న‌సేన కార్యాల‌యం వ‌ద్ద కోలాహ‌లం కనిపించింది. వీరి చేరికల కార్యక్రమానికి మంత్రి నాదెండ్ల మనోహర్ అధ్యక్షత వహించారు. 

జనసేన పార్టీలో చేరిన వైసీపీ కీలక నేతలు

పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించిన జనసేన అధ్యక్షులు
శ్రీ @PawanKalyan గారు pic.twitter.com/FyeGsQVy06

— JanaSena Party (@JanaSenaParty) September 26, 2024

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు