కారు కాల్వలోకి దూసుకెళ్లి మహిళ మృతి .. నలుగురికి గాయాలు

మంగళవారం, 19 నవంబరు 2019 (14:01 IST)
ఉయ్యూరు మండల కలవపాముల గ్రామం వద్ద కాల్వలోకి దూసుకెళ్లిన కారు. ఈ ప్రమాదంలో గుడివాడకు చెందిన గౌరీ కుమారి 60 సంవత్సరాల మహిళ మృతి. 
 
కార్తీక మాసం నోము నిమిత్తం ఐదుగురు కుటుంబ సభ్యులు గన్నవరం వెళ్లి నుంచి గుడివాడ తిరిగి వెళ్తున్న క్రమంలో కలవపాముల వద్ద కారు అదుపుతప్పి కాల్వలోకి ఆదివారం రాత్రి 11 గంటలకు దూసుకుపోయింది.
 
ఈ ఘటన చూసిన స్థానికులు వెంటనే స్పందించి కారులో ఉన్న నలుగురిని కాపాడగా గౌరీ కుమారి మహిళను కాపాడే సమయానికి ఆలస్యం కావడంతో నీరు ఎక్కువగా తాగేసి మృతి చెందినట్లు స్థానికులు చెప్తున్నారు. 
 
ఘటనా సమాచారాన్ని అందుకున్న గ్రామీణ ఎస్సై దుర్గ మహేశ్వరరావు ప్రదేశానికి చేరుకుని క్షతగాత్రులను గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు ఐపీసీ 304ఏ సెక్షన్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్.ఐ దుర్గా మహేశ్వరరావు తెలిపారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు