రాష్ట్రంలో మూడు రోజులు భారీ వర్షాలు - ఆర్టీజీఎస్ హెచ్చరిక

మంగళవారం, 22 అక్టోబరు 2019 (13:51 IST)
కోస్తా, ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే సూచనలున్నాయి. మంగళవారం చిత్తూరు, అనంతపురం, నెల్లూరు,  ప్రకాశం, గుంటూరు, కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. 
 
మిగిలిన జిల్లాల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే సూచనలు వున్నట్లు రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ వెల్లడించింది. బుధ, గురువారాల్లో కూడా కోస్తా, ఉత్తారాంద్ర జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి. 
 
రాయలసీమలో వాగులు, వంకలు, నదుల్లో భారీగా వర్షపు నీరువచ్చే అవకాశాలున్నాయి. ప్రజలు వాగులు, నదులు దాటకుండా జాగ్రత్తలు పాటించాలని రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ (ఆర్టీజీఎస్) అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇంకా 
 
పలు చోట్ల పిడుగులు, ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశాలున్నాయని రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ జారీ చేసిన ఓ ప్రకటనలో వెల్లడించింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు