kurnool bus accident: 120 కిమీ వేగంతో బస్సు, ఎదురుగా దూసుకొచ్చిన తాగుబోతు బైకర్ ఢీకొట్టాడు

ఐవీఆర్

శుక్రవారం, 24 అక్టోబరు 2025 (20:02 IST)
కర్నూలు బస్సు ప్రమాదానికి గల కారణం వెలుగులోకి వచ్చింది. మద్యం మత్తులో బైకు నడుపుతో రాంగ్ రూట్లో... అంటే వన్ వేకి ఎదురుగా బైకర్ రావడంతోనే ఈ ఘోర ప్రమాదం జరిగినట్లు చెపుతున్నారు. కర్నూలు మండలం ప్రజానగర్‌కు చెందిన 20 ఏళ్ల శంకర్ జాతీయ రహదారి 44 మీద కర్నూలు పట్టణ సమీపంలో రాంగ్ రూట్లో వచ్చాడు. ఇతడు గత రెండ్రోజుల క్రితం తన పెళ్లి విషయమై గొడవపడి ఇంటికి వెళ్లకుండా మద్యం సేవిస్తూ బైక్ పైన తిరుగుతున్నట్లు తెలిసింది.
 
ఈ క్రమంలో శుక్రవారం తెల్లవారు జామున అతడు రాంగ్ రూట్లో 120 కిలోమీటర్ల వేగంతో రహదారిపై వస్తున్న బస్సుకి ఎదురుగా వచ్చేసాడు. అకస్మాత్తుగా అతడు ఎదురుగా రావడంతో డ్రైవరు బ్రేకులు వేసే సాహసం చేయలేకపోయాడు. బైకుపైకి అలాగే పోనిచ్చేసాడు. ఐతే ఈ ప్రమాదంలో అతడి మృతి చెందడంతో పాటు అతడి వాహనం ట్యాంక్ రోడ్డుకి తగిలి మంటలు చెలరేగి క్షణాల్లో బస్సు దగ్ధమైంది.
 
ప్రయాణికులు తేరుకునేలోపుగానే ఘోరం జరిగిపోయింది. ఈ ప్రమాదంలో 21 మంది సజీవ దహనమయ్యారు. మరో నలుగురి పరిస్థితి విషమంగా వున్నట్లు సమాచారం. ఈ ప్రమాదంలో అటు బైకర్ నిర్లక్ష్యంతో పాటు బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం కూడా వుండటంతో దారుణం జరిగిపోయింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు