లైన్‌మేన్ నిర్లక్ష్యం.. నిండు ప్రాణం బలి - భారీగా ఆస్తినష్టం

శుక్రవారం, 6 ఆగస్టు 2021 (12:07 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనంతపురం జిల్లాలోని ముదిగుబ్బలో విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యంతో ఓ నిండు ప్రాణం గాల్లో కలిసిపోయింది. లైన్‌మెన్ నిర్లక్ష్యంతో 11 కేవీ సప్లైను గ్రామ లైన్‌కు ఇచ్చారు. షార్ట్ సర్క్యూట్‌తో ఒకరు మృతి చెందారు.
 
అలాగే, భారీగా ఆస్తి నష్టం జరిగింది. గ్రామంలోని చాలా ఇళ్లల్లో విద్యుత్ పరికరాలు నాశనం అయ్యాయి. హైవోల్టేజ్ విద్యుత్‌కు ఇళ్లల్లోని టీవీలు, ఫ్రిజ్‌లు, మోటార్లు కాలిపోయాయి. 
 
సాంకేతిక లోపంతో హైవోల్టేజ్ విద్యుత్ సరఫరా అయిందని అధికారులు అంటున్నారు. రెవెన్యూ అధికారులు అక్కడి చేరుకుని ఆస్తి నష్టాన్ని అంచనా వేసే పనిలో ఉన్నారు. ఈ ఘటనతో విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంపై గ్రామ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు