కొణిదెల గ్రామాన్ని దత్తత తీసుకున్న పవన్ కల్యాణ్.. రూ.50లక్షలు విరాళం

సెల్వి

బుధవారం, 11 జూన్ 2025 (10:35 IST)
ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కొణిదెల గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. ఈ మేరకు కొణిదెల గ్రామాభివృద్ధికి రూ.50లక్షలు ప్రకటించారు. ఆ మొత్తానికి సంబంధించిన చెక్కును నంద్యాల కలెక్టరేట్‌లో అందించారు. ఈ ఏడాది మార్చి నెలలో పవన్ కల్యాణ్ కర్నూలు జిల్లాలో పర్యటించారు. 
 
ఆ సమయంలో కొణిదెల గ్రామ పరిస్థితి గురించి నందికొట్కూరు ఎమ్మెల్యే జయసూర్య, ఆ గ్రామ సర్పంచ్ వివరించారు. దీంతో ఆయన ఆ గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. తన సొంత ట్రస్ట్ నుంచి రూ.50 లక్షల నిధులను ఈ గ్రామానికి కేటాయించారు. ఈ నిధులను కొణిదెల గ్రామాభివృద్ధికి వినియోగించాలని ఆమె సూచించారు.
 
ఈ ఏడాది మార్చి నెలలో పవన్ కల్యాణ్ కర్నూలు జిల్లాలో పర్యటించారు. ఆ సమయంలో కొణిదెల గ్రామ పరిస్థితి గురించి నందికొట్కూరు ఎమ్మెల్యే జయసూర్య, ఆ గ్రామ సర్పంచ్ వివరించారు. దీంతో ఆయన ఆ గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. తన సొంత ట్రస్ట్ నుంచి రూ.50 లక్షల నిధులను ఈ గ్రామానికి కేటాయించారు.
 
గ్రామంలో చేయాల్సిన పనులకు సంబంధించి ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులను ఆయన ఆదేశించగా, గ్రామంలో పూర్తి స్థాయిలో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు జిల్లా యంత్రాంగం ప్రణాళిక రూపొందించింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు