పవన్ కల్యాణ్ గెలుపు.. రేణూ దేశాయ్ పోస్ట్ వైరల్

సెల్వి

మంగళవారం, 4 జూన్ 2024 (21:14 IST)
జనసేనాని పవర్ స్టార్ పవన్ కల్యాణ్ భారీ మెజారిటీతో పిఠాపురం ఎమ్మెల్యేగా గెలుపును నమోదు చేసుకున్నారు. త‌న స‌మీప ప్ర‌త్య‌ర్థి, వైసీపీ అభ్య‌ర్థి వంగ గీతపై దాదాపు 70 వేలకుపైగా ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారు. 
 
ఈ నేపథ్యంలో  పవన్ గెలుపుపై ఆయన మాజీ భార్య రేణూ దేశాయ్ చేసిన పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. "ఆద్య, అకీరాలు ఎంతో ఆనందంగా ఉన్నారు.

ఈ తీర్పు వల్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా ప్రయోజనం పొందుతారని ఆశిస్తున్నాను" అంటూ ఇంట్లో ఆధ్య సంతోషంగా ఉన్న క్షణాలను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశారు. ప్రస్తుతం రేణూ దేశాయ్ పోస్టుపై నెటిజన్లతో పాటు పవన్ అభిమానులు సానుకూలంగా స్పందిస్తున్నారు.
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by renu desai (@renuudesai)

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు