పిఠాపురం ఆడపడుచులకు చీరలు, పసుపు కుంకుమ: పవన్ నూరేళ్లు చల్లగా వుండాలి (Video)

ఠాగూర్

శుక్రవారం, 30 ఆగస్టు 2024 (13:35 IST)
పిఠాపురం శ్రీపాదగయ పురుహూతికా అమ్మవారి క్షేత్రంలో శుక్రవారం పిఠాపురం ఎమ్మెల్యే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యామ్ ఆధ్వర్యంలో వరలక్ష్మి వ్రతం జరిగింది. ఈ సందర్భంగా పిఠాపురం ఆడపడుచులకు సంప్రదాయ ఆనవాయితీ ప్రకారం 12 వేల చీరలు, పసుపు కుంకుమను ఆయన అందజేశారు. దీంతో పిఠాపురం మహిళల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. వారు ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తూ, పవన్ కళ్యాణ్ నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో ఉండాలని దీవిస్తున్నారు. ఇంత వైభవంగా సాగిన ఈ కార్యక్రమంలో వేలాదిమంది మహిళలు ఎటువంటి ఇబ్బంది లేకుండా పాల్గొని అమ్మవారి సమక్షంలో చీర, పసుపు, కుంకుమ అందుకోవడం జరిగిందని తెలిపారు. 



పిఠాపురం శ్రీపాదగయ పురుహూతికా అమ్మవారి క్షేత్రంలో ఈరోజు పిఠాపురం ఎమ్మెల్యే, గౌ|| ఉప ముఖ్యమంత్రి @PawanKalyan గారు వరలక్ష్మి వ్రతం సందర్భంగా పిఠాపురం ఆడపడుచులకు సంప్రదాయ ఆనవాయితీ ప్రకారం 12 వేల చీరలు, పసుపు కుంకుమ అందించడంతో ఆనందాన్ని వ్యక్తపరుస్తున్న పిఠాపురం ఆడపడుచులు. ఇంత… pic.twitter.com/RqyoF5p5bL

— JanaSena Party (@JanaSenaParty) August 30, 2024

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు