జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పోలవరం ప్రాజెక్టు పనులను క్షేత్ర స్థాయిలో పరిశీలించి, పనుల సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పాత్రికేయుల సమక్షంలో డయాఫ్రం వాల్ ప్యానెల్ మందాన్ని కొలిచి 1.5 మీటర్లు అని చూపించారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో సిడబ్ల్యుసి, నీటిపారుదల అధికారులు, నిర్మాణ సంస్థలు సంయుక్తంగా తీసుకున్న కాలపరిమితి షెడ్యూల్ ప్రకారం ప్రాజెక్టు పనులు వేగంగా జరుగుతున్నాయని మంత్రి రామానాయుడు అన్నారు.
ఈ సంవత్సరం డయాఫ్రం వాల్ నిర్మాణం పూర్తి చేయాలనే లక్ష్యం నెరవేరుతుందని మంత్రి విశ్వాసం వ్యక్తం చేశారు. పోలవరం హెడ్ వర్క్స్ లో 80 శాతానికి పైగా ఇప్పటికే పూర్తయ్యాయని ఆయన వివరించారు. జూన్ 30 నాటికి పోలవరం ఎడమ ప్రధాన కాలువ పనులు పూర్తి పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ లేదని మంత్రి స్పష్టం చేశారు.