కేటీఆర్.. నాతో పెట్టుకోవద్దు. ప్రపంచాన్ని ఓడించి జయించా : కేఏ పాల్

మంగళవారం, 7 మే 2019 (16:25 IST)
తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు, క్రైస్తవ మతబోధకుడు కేఏ పాల్ వార్నింగ్ ఇచ్చారు. ఆయన మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ, ప్రపంచాన్ని ఓడించి జయించానని తనతో ఎవరూ పెట్టుకోవద్దని హెచ్చరించారు. 
 
డబ్బు ఎక్కువై అహంకారంతో మాట్లాడుతున్నారనీ, కొనుగోలు చేయడానికి తాను కాంగ్రెస్ పార్టీ నేతలను కాదన్నారు. అలాగే, మోసపోవడానికి తాను ప్రొఫెసర్ కోదండరామ్‌ను కాదన్నారు. 
 
తెలంగాణలో 23 కుటుంబాలు ఏడుస్తున్నాయని.. కేటీఆర్‌కు డబ్బులు ఎక్కువైతే కాంగ్రెస్, కోదండరాంతో పెట్టుకోవాలంతే కానీ ప్రపంచాన్ని జయించిన పాల్‌తో పెట్టుకోవద్దని ఆయన హెచ్చరించారు. తానేం మందా కృష్ణమాదిగను కానని.. 2008లో కేసీఆర్ తన దగ్గరకు వస్తే ఆశీర్వదించానని పాల్ చెప్పుకొచ్చారు. 
 
మొదట తెలంగాణకు మద్దతు ఇచ్చి కేసీఆర్‌కు ఫండింగ్ కూడా చేశానని చెప్పాురు. తన మాటలు నిజమా కాదా అనే విషయం తెలుసుకోవాలంటే ముఖ్యమంత్రి కేసీఆర్‌ను అడిగి తెలుసుకోవచ్చన్నారు. ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్యలు తెలంగాణ సర్కారుకే అవమానమన్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు