భారీ వర్షాలు.. దెబ్బతిన్న 124 ప్రాజెక్టులు.. మొత్తం రూ.3.71 కోట్లు అవసరం

సెల్వి

శుక్రవారం, 13 సెప్టెంబరు 2024 (12:11 IST)
ఏపీలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు, ఈదురు గాలుల కారణంగా ఉమ్మడి విశాఖ జిల్లాలో జలవనరుల శాఖకు చెందిన పలు నిర్మాణాలు గణనీయంగా దెబ్బతిన్నాయి. 
 
ప్రాథమిక అంచనా ప్రకారం విశాఖపట్నం జిల్లాలో చెరువులు మినహా 18 భారీ, మధ్యతరహా, చిన్న తరహా ప్రాజెక్టులు, అనకాపల్లిలో 105, అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఒకటి కలిపి మొత్తం 124కు చేరాయి. ఈ 124 ప్రాజెక్టుల్లో 136 మరమ్మతులు చేపట్టేందుకు రూ.50 కోట్లు అవసరమవుతాయని అంచనా. 
 
వైజాగ్‌లోని జలవనరుల శాఖకు చెందిన 18 నిర్మాణాల వద్ద రూ.3.96 కోట్ల నష్టం వాటిల్లింది. తాత్కాలిక మరమ్మతులకు రూ25.55 లక్షలు, శాశ్వత మరమ్మతులకు రూ.3.71 కోట్లు అవసరమవుతాయని అంచనా. 
 
అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో దెబ్బతిన్న నీటి నిర్మాణాలకు మరమ్మతులు చేసేందుకు మరిన్ని నిధులు అవసరమని అధికారులు అంచనా వేశారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు