"రైతు బంధు" ద్వారా 6 నెలల వరకు వడ్డీలేని రుణాలు!

బుధవారం, 9 జులై 2014 (15:33 IST)
"రైతు బంధు" పథకాన్ని ప్రారంభించనున్నట్లు తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీష్ రావు చెప్పారు. ఈ పథకం ద్వారా రైతులకు 6 నెలల వరకు వడ్డీ లేని రుణాన్ని ఇవ్వనున్నట్లు ఆయన వెల్లడించారు. మార్టిగేజ్ లేకుండానే రైతులకు రూ. 2 లక్షల వరకు రుణాన్ని ఇస్తామని ఆయన పేర్కొన్నారు.
 
మార్కెట్ యార్డుల్లో మౌలిక వసతులను మెరుగుపరుస్తామని హరీష్ రావు చెప్పారు. మార్కెట్ యార్డుల్లో ఈ-టెండరింగ్, ఈ-మార్కెటింగ్ విధానాలను ఖమ్మం జిల్లాలో ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టనున్నట్లు ఆయన వెల్లడించారు. ఇంకా రైతులకు మార్కెటింగ్ అధికార పదవులను ఇస్తామని హరీష్ రావు అన్నారు. 

వెబ్దునియా పై చదవండి