శ్రీకాళహస్తిలో ఘోర రోడ్డు ప్రమాదం - ఆరుగురి దుర్మరణం

ఆదివారం, 9 జులై 2023 (14:47 IST)
తిరుపతి జిల్లా శ్రీకాకుళంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆరుగురు దుర్మరణం పాలయ్యారు. శ్రీకాళహస్తికి సమీపంలోని మిట్టకండ్రిగ వద్ద కారు, లారీలు ఢీక్కొన్నాయి. విజయవాడ నంచి శ్రీకాళహస్తికి ఇన్నోవా కారులో బయలుదేరి వెళుతుండగా, శ్రీకాళహస్తి నుంచి తిరుపతి వైపు వెళుతున్న లారీ ఒకటి అదుపుతప్పి బలంగా ఢీకొట్టింది. 
 
ఈ దుర్ఘటనలో నలుగురు మహిళలు, ఇద్దరు పురుషులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. కారులో ప్రయాణిస్తున్న మరో వ్యక్తి తీవ్రంగా గాయపడగా, ఆయన్ను శ్రీకాళహస్తి ఏరియా ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు