కాలువ‌లోకి దూసుకెళ్ళిన ఎర్ర‌గొండ‌పాలెం ఆర్టీసీ బ‌స్సు

బుధవారం, 15 సెప్టెంబరు 2021 (15:20 IST)
ఇటీవ‌ల వ‌ర్షాల‌కు రోడ్లు అత‌లాకుత‌లం అయిపోయాయి. దీనితో త‌ర‌చు రోడ్డు ప్ర‌మాదాలు సంభ‌విస్తున్నాయి. కృష్ణా జిల్లా నూజివీడు నుండి ఎర్రగొండపాలెం వెళుతున్నఆర్టీసీ బస్సుకు తృటిలో పెను ప్రమాదం త‌ప్పింది.

రోడ్డు స‌రిగా లేక‌పోవ‌డంతో బ‌స్సు ముందు వైపు టైర్ ఒక్క‌సారిగా పేలిపోయింది. దీనితో బ‌స్సు అదుపు త‌ప్పి ప‌క్క‌నే ఉన్న పంట కాలువలోకి దూసుకెళ్లింది. బస్సులో సుమారు 30 మంది ప్రయాణిస్తున్నట్లు సమాచారం. అనుకోని ఈ సంఘ‌ట‌న‌తో వారంతా ప్ర‌మాదంలో ప‌డ్డారు.

కానీ, బ‌స్సు డ్రైవర్ చాకచక్యంతో బండిని ఆపడంతో ప్రయాణికులకు పెద్ద ప్రమాదం త‌ప్పింది. డ్రైవ‌ర్, కండ‌క్ట‌ర్ జ‌రిగిన సంఘ‌ట‌న‌ను ఆర్టీసీ ఉన్న‌తాధికారుల‌కు వివ‌రించారు. బ‌స్సును కాలువ లోంచి బ‌య‌ట‌కు తీసే ప్ర‌య‌త్నం చేస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు