కాలేజీ బిల్డింగ్ మీద నుంచి దూకేసిన విద్యార్థిని.. కారణం ఏంటి? (Video)

సెల్వి

శనివారం, 19 ఏప్రియల్ 2025 (11:24 IST)
Student
సూర్యాపేట జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కాలేజీ బిల్డింగ్ మీద నుంచి ఓ విద్యార్థిని దూకి ఆత్మహత్యకు పాల్పడింది. వివరాల్లోకి వెళితే.. సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలం గేట్ ఇంజనీరింగ్ కాలేజీలో ఈ ఘటన చోటుచేసుకుంది. 
 
ఉగాది పండుగకు వెళ్లి రాత్రి తల్లితో కలిసి కాలేజీకి వచ్చిన కృష్ణవేణి.. కాలేజీ భవనం పై నుంచి ఆత్మహత్యకు పాల్పడింది. ప్రస్తుతం ఆమె బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతోంది. మంచిర్యాలకు సంబంధించిన కృష్ణవేణి. ఇక ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

కాలేజ్ భవనం పై నుంచి దూకి బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య

సూర్యాపేట - చిలుకూరు మండలం గేట్ ఇంజినీరింగ్ కాలేజ్ భవనం పై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డ బీటెక్ విద్యార్థిని కృష్ణవేణి

ఆత్మహత్యకు ముందు తల్లితోనే హాస్టల్ గదిలో కృష్ణవేణి

తెలవారుజామున కాలేజ్ భవనం పై నుంచి దూకి ఆత్మహత్య… pic.twitter.com/EPB4gdtNxw

— Telugu Scribe (@TeluguScribe) April 19, 2025

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు