కన్నా, జీవిల్‌కు పిచ్చికుక్క కరిచిందా ?

గురువారం, 27 సెప్టెంబరు 2018 (12:14 IST)
తెలుగుదేశం ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బిజెపీ నాయకులు కన్నా, జీవీఎల్‌లకు పిచ్చికుక్క కరచినట్లుంది. అందుకే పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు అని తీవ్ర విమర్శలు చేశారు తెలుగుదేశం ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్. ఎన్నికల్లో పోటీ చేయడానికి ఆంద్రప్రదేశ్‌లో బీజేపీకి అభ్యర్థులు కూడా దొరకరన్న సంగతి గ్రహించాలన్నారు.
 
రాఫెల్ కుంభకోణం పైన జగన్ ఎందుకు మాట్లాడటం లేదో చెప్పాలన్నారు. పాదయాత్రల పవిత్రతను జగన్ మంటగలిపాడంటూ వ్యాఖ్యలు చేశారు. 3 వేలు కాదు 30 వేల కిలోమీటర్ల పాదయాత్ర చేసినా జగన్ మోహన్ రెడ్డిని ఆంధ్రప్రజలు విశ్వసించరని విమర్శించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు