సిఎం జగన్ సమక్షంలో పారిశుద్ధ్య కార్మికురాలు బి. పుష్పకుమారికి తొలి టీకా

శనివారం, 16 జనవరి 2021 (15:47 IST)
సిఎం జగన్ సమక్షంలో పారిశుద్ధ్య కార్మికురాలు బి. పుష్ప కుమారి ఆంధ్రప్రదేశ్‌లో COVID19 వ్యాక్సిన్‌ను తొలిసారిగా తీసుకున్నారు. మరోవైపు గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో శనివారం ఉదయం కోవిడ్ టీకా కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి మేకతోటి సుచరిత ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఎం. గిరిధర్, కలెక్టర్ శామ్యూల్ ఆనంద్, జెస్సీ ప్రశాంతి తదితరులు పాల్గొన్నారు.
 
ఈ సందర్భంగా సుచరిత మాట్లాడుతూ, "నేను ఈ రోజు చాలా సంతోషంగా ఉన్నాను. కరోనా మహమ్మారితో చాలా ఇబ్బందులు ఎదురయ్యాయి. కరోనా కారణంగా ప్రపంచం మొత్తం స్తంభించిపోవడం మనం చూశాము. మన దేశంలో వ్యాక్సిన్ తయారు చేసాము. చాలా కంపెనీలు ప్రపంచం టీకాలు తయారు చేయడం ప్రారంభించాయి. గుంటూరు జిల్లాలో 31 టీకా కేంద్రాలను ఏర్పాటు చేశాం. కోవిడ్ నిబంధనల ప్రకారం మేము అన్ని చర్యలు తీసుకుంటున్నాము. మహమ్మారి నిర్మూలన కార్యక్రమంలో భాగం కావడం ఆనందంగా ఉంది. ఒక్కొక్కరికి రెండు మోతాదులు ఇస్తారు. టీకాలు వేసిన తరువాత లబ్ధిదారుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.” అని సుచరిత అన్నారు.
 
తెలంగాణలో
దేశవ్యాప్తంగా 3,006 కేంద్రాల్లో ఒకేసారి టీకా ప్రక్రియ ప్రారంభమైంది. టీకా ప్రక్రియ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ప్రారంభమైంది. అయితే, మొదటి వ్యాక్సిన్ నేను తీసుకుంటానంటూ ప్రకటించిన తెలంగాణ ఆరోగ్య మంత్రి ఈటెల రాజేందర్ చివరి నిమిషంలో వెనక్కి తగ్గారు.
 
గాంధీ ఆసుపత్రిలో టీకా ప్రక్రియను ఆయన శనివారం ప్రారంభించారు. ఆయన మొదటి టీకా తీసుకోలేదు. మొదటి కరోనా వ్యాక్సిన్ పారిశుధ్య కార్మికులకు, ఆరోగ్య కార్యకర్తలకు మాత్రమే ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలను జారీ చేసిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా గాంధీ ఆసుపత్రిలో ఆరోగ్య కార్యకర్త కృష్ణమ్మకు మొదటిసారి టీకా వేశారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు