తిరుమల లడ్డూ ప్రసాదం తింటున్న సమయంలో తన నాలుకకు గాయమైందని తెలంగాణ రాష్ట్రం, రంగారెడ్డి జిల్లాకు చెందిన నవీన్ కుమార్ అనే వ్యక్తి చేసిన వ్యాఖ్యలపై టీటీడీ సీరియస్ అయ్యింది. ఈ విషయం సోషల్ మీడియాలో ప్రచారం చేయడంతో తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు రంగంలోకి దిగారు. సంబంధిత వ్యక్తికి వైద్య సహాయం అందిస్తూ తిరుమలలోని అశ్విని ఆసుపత్రికి తరలించి పరీక్షలు నిర్వహించింది.
అనంతరం మరింత స్పష్టత కోసం స్విమ్స్ ఆసుపత్రిలో కూడా వైద్య పరీక్షలు చేయించారు. లడ్డూ ప్రసాదంలో ఎటువంటి ఇతర పదార్థాలు లేవని, నవీన్ ఆరోపించిన గాయం తన నాలుకను తానే గట్టిగా కొరుక్కోవడం వల్ల సంభవించిందని వైద్యులు తేల్చారు.