బాలికపై ఇద్దరు యువకుల అత్యాచారం

మంగళవారం, 2 జులై 2019 (14:10 IST)
రైల్వేస్టేషన్ సమీపంలోని హార్డ్ పేటలో దారుణం జరిగింది. మైనర్ బాలికపై ఇద్దరు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. బాలికకు ఆరోగ్య సమస్య తలెత్తడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత బాలిక నుంచి వివరాలు సేకరించారు. 

పైగా, అత్యాచార విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పి కన్నీటి పర్యంతమైంది. ఆ తర్వాత సత్యనారాయణపురం పోలీస్ స్టేషనులో ఫిర్యాదు చేయగా, నిందితులపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు