చలిగా ఉందని గదిలోకి తీసుకెళ్లి బాలికపై వాచ్‌మెన్ అత్యాచారం

సోమవారం, 25 జూన్ 2018 (11:28 IST)
హైదరాబాద్ నగరంలో బాలికపై అత్యాచారం జరిగింది. చలిగా ఉందని గదిలో పడుకుందామని నమ్మించి గదిలోకి తీసుకెళ్లిన వాచ్‌మెన్ ఆ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే..
 
హైదరాబాద్, షాహినాయతగంజ్‌కు చెందిన దంపతులకు ముగ్గురు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు. వీరిలో రెండో కుమార్తె వయసు 14 యేళ్లు. ప్రతిరోజు స్కూల్‌ నుంచి ఇంటికి వచ్చి బేగంబజార్‌లో వద్ద ఉన్న ఓ కాంప్లెక్స్‌లో ఆడుకుంటుంది. 
 
శనివారం కూడా ఆడుకుని ఇంటికి వచ్చింది. భోజనం చేసిన తర్వాత కరెంట్‌ పోయింది. దీంతో రాత్రి 10 గంటల ప్రాంతంలో బాలిక బయటకు వెళ్లింది. బయటకు వెళ్లిన కుమార్తె ఇంటికి రాకపోవడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు బిడ్డకోసం వెతకసాగారు. 
 
ఇంతలో ఆ బాలికను గమనించిన వాచ్‌మెన్ తులసీరాం యాదవ్‌.. బయట చలిగా ఉంటుంది.. గదిలోకి వెళ్లి పడుకుందామని చెప్పాడు. దీంతో ఆ బాలిక అతనితో కలిసి గదిలోకి వెళ్లింది. ఇదే అదునుగా వాచ్‌మన్‌ బాలికపై అత్యాచారానికి తెగబడ్డాడు. 
 
ఆ తర్వాత ఇంటికి పంపించాడు. ఇంటికెళ్లిన ఆ బాలిక ముభావంగా ఉండడంతో ఏం జరిగిందని ప్రశ్నించగా... జరిగిన విషయం చెప్పింది. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకొని పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు