కరోనావైరస్ బారన పడ్డ వైసీపీ ఎమ్మెల్యే, కోనేటి ఆదిమూలం

సోమవారం, 28 సెప్టెంబరు 2020 (14:01 IST)
కరోనావైరస్ మహమ్మారి రోజురోజు‌కు విజృంభిస్తోంది. దీనికితోడు అనేక మంది రాజకీయ నేతలు కరోనా బారిన పడుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మరో వైసీపీ ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. సత్యవేడు వైసీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంకు ఇటీవల కరోనా లక్షణాలు కనిపించడంతో ఆయన వైద్యులను సంప్రదించారు.
 
దీంతో ఆయనకు కరోనా  పరీక్షలు నిర్వహించారు వైద్యులు. పరీక్షల్లో ఆయనకు కరోనా పాజిటివ్‌గా నిర్దారించారు. దీంతో ఆయన ఆసుపత్రిలో చేరారు. తిరుపతిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో కరోనాకు చికిత్స అందుతోందని తెలిసింది.
 
కాగా ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లో పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలకు కరోనా సోకిన విషయం తెలిసిందే. వారిలో కొందరు ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకోగా, మరికొందరు ఇంట్లోనే చికిత్స తీసుకొని కోలుకున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు