ప్రముఖ రౌడీషీటర్, వైకాపా నేత బోరుగడ్డ అనిల్ కుమార్ ఎట్టకేలకు బుధవారం ఉదయం రాజమండ్రి జైలు అధికారుల ఎదుట లొంగిపోయాడు. నిజానికి మంగళవారం సాయంత్రం 5 గంటలకు ఆయన లొంగిపోవాల్సివుంది. కానీ, ఆయనకు మరోమారు మధ్యంంతర బెయిల్ను పొడగించేందుకు హైకోర్టు నిరాకరించింది. దీంతో ఆయనకు మరోమార్గం లేక బుధవారం లొంగిపోయాడు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేశ్, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, వారి కుటుంబ సభ్యులను దూషించిన కేసులో అరెస్టయిన మధ్యంతర బెయిలుపై ఉన్న వైకాపా నేత, రౌడీషీటర్ బోరుగడ్డ అనిల్ లొంగిపోయాడు.
తల్లి అనారోగ్యం పేరుతో బెయిలు పొడిగించుకునేందుకు అనిల్ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. మధ్యంతర బెయిల్ను పొడగించే ప్రసక్తే లేదని హైకోర్టు తేల్చి చెప్పింది. మంగళవారం (11) సాయంత్రం 5 గంటల్లోపు లొంగిపోవాల్సిందేనని స్పష్టం చేసింది. అయినప్పటికీ అజ్ఞాతం వీడకపోవడంతో లొంగిపోతాడా? లేడా? అన్న చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలో ఈ ఉదయం ఆయన మీడియా కంటపడకుండా రాజమండ్రి సెంట్రల్ జైలుకు చేరుకుని జైలు సూపరింటెండెంట్ వద్ద లొంగిపోయాడు.