1. సాత్విక ఆహారం: మీరు తీసుకునే ఆహారం ఎక్కువ కారంగా, స్పైసీగా ఉండకూడదు. పాత బియ్యం, శెనగలు, ఆవుపాలతో చేసిన తినుబండారాలు, ద్రాక్ష, దానిమ్మ, మాంసం సూప్... ఇవన్నీ మీ కంటి చూపును చక్కగా కాపాడుతాయి. తీక్షణమైన చూపును ఇస్తాయి. త్రిఫలం అంటే తాని, ఉసిరి, నిమ్మ ఉప్పు, స్వచ్ఛమైన నీళ్ళు... కంటికి మెరుపునిస్తాయి. జింక్ కంటి చూపును వృద్ధి చేస్తుంది.
ఇలా చేయకండి: నేరుగా సూర్యుడిని చూడకండి... అలాగే పెద్ద కాంతిని, విస్పోటనాలను నేరుగా కళ్ళతో చూడకూడదు. దూరంగా ఉండే చిన్న వస్తువులను తదేకంగా చూడొద్దు. అలాగే రైలు, లేదా బస్సు ప్రయాణాల్లో పుస్తకాలు చదవకండి. వాహనం కదిలికల వల్ల దృష్టి నిలపలేక... అవి మీ కంటిని బాగా శ్రమపెడతాయి.
చిన్నచిన్న చిట్కాలతో కంటికి మంచి...
- భోజనం చేసే ముందు కంటి రెప్పలపై అరచేతిని ఉంచి కాసేపు మర్దనా చేయండి.