దేశ వ్యాప్తంగా తగ్గిన గ్యాస్ సిలిండర్ ధరలు

ఠాగూర్

ఆదివారం, 1 జూన్ 2025 (13:10 IST)
దేశంలో గ్యాస్ సిలిండర్ ధరలు తగ్గాయి. ప్రతి నెల మొదటి తేదీన ఆయిల్, గ్యాస్ ధరలను ఆయిల్ కంపెనీలు సవరిస్తుంటాయి. ఆ ప్రకారంగా జూన్ ఒకటో తేదీన పెట్రోల్, డీజల్, వంట గ్యాస్ ధరలను సవరించాయి. ఈ సవరించిన ధరల మేరకు పెట్రోల్, డీజల్ ధరల్లో ఎలాంటి మార్పు లేదు. అయితే, వాణిజ్య అవసరాలకు ఉపయోగించే వంట గ్యాస్ సిలిండర్ ధరలో మాత్రం మార్పు చోటుచేసుకుంది.
 
19 కేజీల వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరపై రూ.24 మేరకు తగ్గించింది. ఈ తగ్గించిన ధరలు నేటి అమల్లోకి రానున్నాయి. అయితే, రాష్ట్రాల వారీగాఈ తగ్గింపులో మార్పు ఉంటుంది. ఈ తాజా తగ్గింపుతో దేశ రాజధాని ఢిల్లీలో సిలిండర్ ధర రూ.1723.50గాను ఉంటే, గృహ అవసరాలకు ఉపయోగించే 14.2 కిలోల ఎల్పీజీ సిలిండర్ ధరలను మాత్రం ఆయిల్ కంపెనీలు సవసరించేలేదు. 
 
మరోవైపు, ఏప్రిల్ నెలలోరూ.41, మే నెలలో రూ.14.50 వరకు వీటి ధరలను తగ్గించిన విషయం తెల్సిందే. తాజా మరో రూ.24 మేరకు తగ్గించింది. విమాన ఇంధన (ఏటీఎఫ్) ధరలను కూడా ఆయిల్ కంపెనీలు మూడు శాతం మేరకు తగ్గించాయి. ఈ ధరల్లో కూడా ఒక నగరానికి మరో నగరానికి వ్యత్యాసం ఉండటం గమనార్హం.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు