చంద్రయాన్-3 విజయోత్సవం తర్వాత డా. సుబ్బారావు అంతరిక్ష సరిహద్దులను అన్వేషించారు

సోమవారం, 4 సెప్టెంబరు 2023 (21:28 IST)
సోషల్ నెట్‌వర్కింగ్ యాప్‌లలో విప్లవాత్మక మార్పులు, సుసంపన్నమైన సంభాషణలను సులభతరం చేయాలనే తమ లక్ష్యంకు విశేషమైన కొనసాగింపుగా, ఖుల్ కే సగర్వంగా తమ తాజా రౌండ్‌టేబుల్ చర్చను నిర్వహించింది, దీనిలో గౌరవనీయ డాక్టర్ సుబ్బారావు కూడా పాల్గొన్నారు. డా. రావు, భారతదేశపు ప్రముఖ ఏరోస్పేస్, డిఫెన్స్ తయారీదారు అయిన అనంత్ టెక్నాలజీస్ లిమిటెడ్ యొక్క వ్యవస్థాపకులు- సిఎండి. 
 
ప్రఖ్యాత జర్నలిస్ట్ పల్లవ బాగ్లా ఈ రౌండ్‌టేబుల్‌కు హోస్ట్‌గా వ్యవహరిస్తూ, 'ప్రైవేట్ సంస్థలతో అంతరిక్ష సరిహద్దులను నెట్టడం' అనే అంశం దిశగా  సంభాషణను నడిపించారు. భారతదేశం యొక్క విజయవంతమైన చంద్రయాన్-3 మిషన్ నేపథ్యంలో, దేశీయ మరియు ప్రపంచ రంగాలలో భారతదేశం యొక్క ఏరోస్పేస్ పథాన్ని పునర్నిర్మించడం, ఉపగ్రహ ఉత్పత్తి యొక్క అపారమైన సామర్థ్యాన్ని డా. రావు వెల్లడించారు. 
 
భారతదేశం శాటిలైట్ తయారీ కేంద్రంగా మారాలనే తన లక్ష్యాన్ని డాక్టర్ సుబ్బారావు వెల్లడించారు, అనంత్ టెక్నాలజీస్ ఉదాహరణతో, “మేడ్ ఇన్ ఇండియా, మేడ్ ఫర్ గ్లోబల్ అనేది ఒక కల (ప్రధానమంత్రి మోడీ చెప్పినట్లుగా) మా హృదయాల్లో లోతుగా చొచ్చుకు పోయింది. దాదాపు 75 లాంచ్ వెహికల్స్, 95 స్పేస్‌క్రాఫ్ట్‌ల 'జీరో డిఫెక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ సపోర్ట్' మేము అందించాము. ప్రస్తుతం, మేము అనంత్ థర్డ్ ఐ కాన్స్టెల్లాషన్స్ అని పిలువబడే, మొత్తం భూగోళాన్ని కవర్ చేసే 190 ఉపగ్రహాల కూటమిని రూపొందించడానికి పని చేస్తున్నాము" అని అన్నారు. 
 
ఈ శాటిలైట్ మిషన్‌ల కోసం డాటాను సేవ, కరెన్సీగా ఎలా ఉపయోగించవచ్చనే దానికి సంబంధించి, భారతదేశం ఇప్పటికే తన మిషన్ల ద్వారా డాటాను ఎలా ఉపయోగించుకుందో ఆయన వెల్లడించారు. పెరుగుతున్న డిమాండ్‌లు సృష్టించే సవాలును భారతదేశం అధిగమించగలదని తాను ఎలా విశ్వసిస్తున్నానో ఆయన వివరించారు. వినియోగదారులు వివిధ రంగాలకు చెందిన ప్రభావవంతమైన వ్యక్తులతో కనెక్ట్ అయ్యే రౌండ్ టేబుల్స్ ద్వారా ఇటువంటి ఆకర్షణీయమైన, ఆలోచనాత్మకమైన సంభాషణలను నిర్వహించడం ఖుల్ కే చేస్తుంది. 
 
డా. సుబ్బారావుతో జరిగిన రౌండ్ టేబుల్ చర్చ, అర్థవంతమైన సంభాషణలు వృద్ధి చెందే వేదికను రూపొందించడంలో ఖుల్ కే యొక్క నిబద్ధతను ప్రతిబింబిస్తుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు