పెరుగుతున్న పెట్రోల్ ధరలు- ఆల్ టైమ్ రికార్డ్.. సామాన్యుడికి చుక్కలు

ఆదివారం, 16 సెప్టెంబరు 2018 (11:56 IST)
పెరుగుతున్న పెట్రోల్ ధరలు సామాన్యునికి చుక్కలు చూపిస్తున్నాయి. పెట్రోల్ ధరలు రోజు రోజుకు ఆకాశాన్ని అంటుతున్నాయి. అంతర్జాతీయ స్థాయిలో పెరుగుతున్న క్రూడాయిల్ ధరల వల్లే పెట్రో ఉత్పత్తుల ధరలు పెరుగుతున్నాయని కేంద్రం ప్రకటించింది.


ప్రస్తుతం బ్రెంట్ క్రూడాయిల్ ధర 78 డాలర్ల వద్ద కొనసాగుతోంది. డాలర్‌తో రూపాయి మారకపు విలువలో బలహీన పడటం కూడా ఈ ధరల పెరుగుదలకు సహకరిస్తోందని ఆర్థిక విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 
 
తాజాగా పెట్రోలు ధర ఆదివారం సరికొత్త ఆల్ టైమ్ రికార్డుకు చేరుకుంది. ఆదివారం పెట్రోలు, డీజిల్ ధరలను పెంచుతున్నట్టు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ప్రకటించింది. దేశ రాజధాని న్యూఢిల్లీలో పెట్రోలు ధర లీటరుకు రూ. 81.91కి, డీజిల్ ధర రూ. 73.72కు పెరిగింది.

ముంబయిలో పెట్రోలు ధర ఏకంగా రూ. 89.29కి చేరగా, డీజిల్ ధర రూ. 78.26కు చేరింది. దీంతో దేశ చరిత్రలో పెట్రోలు ధర రూ. 89ని దాటి ముందుకెళ్లడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. తద్వారా పెట్రోల్ ధర సరికొత్త రికార్డును చేరుకున్నట్లైంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు