బంగారం తరహాలోనే వెండి ధరలకు కూడా రెక్కలొచ్చాయ్. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్లో వెండి ఆల్-టైమ్ గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. జూలై గడువుకు సంబంధించిన వెండి ఫ్యూచర్స్ MCXలో కిలోగ్రాముకు రూ. 1,09,748 వద్ద కొత్త ఆల్-టైమ్ గరిష్టాన్ని తాకింది. ఇది మంగళవారం రికార్డును బద్దలు కొట్టింది.
సెప్టెంబర్ ఫ్యూచర్స్ మరింత పెరిగి కిలో గ్రాముకు రూ. 1,11,000ను తాకింది. ఈ లాభాలతో, వెండి ఇప్పుడు దాని ఆల్-టైమ్ కనిష్ట స్థాయి అయిన కిలోకు రూ. 88,050 కంటే దాదాపు 25 శాతం ట్రేడవుతోంది. ముఖ్యంగా పారిశ్రామిక డిమాండ్లో పునరుద్ధరణతో, మద్దతు ఇచ్చే ఫండమెంటల్స్ కారణంగా వెండి స్థిరంగా ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు.