సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ లాభం మొదటి త్రైమాసికంలో 47 శాతం పెరిగి రూ.70 కోట్లకు చేరిక

ఐవీఆర్

శుక్రవారం, 2 ఆగస్టు 2024 (22:05 IST)
నూతన తరపు డిజిటల్ బ్యాంకులలో ఒకటైన సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ లిమిటెడ్ (SSFB), జూన్ త్రైమాసికంలో నికర లాభం 47% పెరిగి రూ. 70 కోట్లకు చేరుకున్నట్లు వెల్లడించింది. ఇదే కాలానికి గత సంవత్సర నికర లాభం  రూ.48 కోట్లుగా వుంది. క్రితం ఏడాది నికర వడ్డీ ఆదాయం  రూ. 225 కోట్లతో పోలిస్తే ఈ సంవత్సర మొదటి త్రైమాసికంలో నికర వడ్డీ ఆదాయం 31% పెరిగి రూ. 293 కోట్లకు చేరుకుంది. అదే సమయంలో దీని నిర్వహణ లాభం రూ.117 కోట్లతో పోలిస్తే 23% పెరిగి రూ.144 కోట్లకు చేరుకుంది.
 
ఇన్‌క్లూజివ్ ఫైనాన్స్, కమర్షియల్ వెహికల్ మరియు LAP వంటి కీలక వ్యాపారాలపై దృష్టి పెట్టడం ద్వారా ఈ వృద్ధి నడపబడింది. వికాస్ లోన్ పోర్ట్‌ఫోలియో పంపిణీ Q1FY25లో రూ. 513 కోట్లుగా ఉంది, ఇది సంవత్సరానికి 141.2% పైగా వృద్ధిని ప్రదర్శిస్తోంది. వికాస్ లోన్‌లు, వీల్స్ మరియు హోమ్ లోన్ విభాగాలలో వితరణ బలంగా కొనసాగుతోంది. Q1FY24లో రూ. 1,190 కోట్లతో పోలిస్తే Q1FY25లో చెల్లింపులు రూ. 1,740 కోట్లుగా ఉన్నాయి, ఇది సంవత్సరానికి 46.3% పెరిగింది. Q1FY24లో రూ. 5,722 కోట్లతో పోలిస్తే Q1FY25లో మొత్తం డిపాజిట్లు రూ. 8,137 కోట్లకు పెరిగాయి. 
 
బ్యాంక్ కస్టమర్ బేస్ 23.6% పెరిగి, జూన్ 2024 నాటికి 30 లక్షల మంది కస్టమర్‌లకు చేరుకుంది, సూర్యోదయ్ SFB 701 బ్యాంకింగ్ అవుట్‌లెట్‌లను నిర్వహిస్తోంది. సూర్యోదయ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, ఎండి & సీఈఓ, శ్రీ బాస్కర్ బాబు మాట్లాడుతూ, “FY25 మొదటి త్రైమాసికంలో బ్యాంక్ స్థిరమైన పనితీరును కనబరిచింది, ఈ పనితీరు FY25 కోసం బ్యాంక్ అందించిన మార్గదర్శకానికి అనుగుణంగా ఉంది. వికాస్ లోన్ మంచి వేగంతో వృద్ధి చెందుతూనే ఉంది, వీల్స్, హోమ్ లోన్ సెగ్మెంట్లలో గణనీయమైన మద్దతు లభించింది. మేము ముందుకు సాగుతున్న వేళ కొత్త అవకాశాలను అన్వేషించగల మా సామర్థ్యంపై మాకు నమ్మకం ఉంది" అని అన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు