జీసీసీ మేయర్‌గా దళిత మహిళ.. 350 ఏళ్ల చెన్నై కార్పొరేషన్ చరిత్రలో?

శనివారం, 5 మార్చి 2022 (09:04 IST)
R Priya
గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ (జీసీసీ) మేయర్‌గా దళిత మహిళ ప్రియ ఎన్నికయ్యారు. దళిత ప్రియ శనివారం ప్రమాణ స్వీకారం చేస్తూనే రికార్డులకెక్కారు. 
 
350 ఏళ్ల చెన్నై కార్పొరేషన్ చరిత్రలో దళిత మహిళకు తొలిసారి మేయర్ పీఠం దక్కగా, 28 ఏళ్ల అతి పిన్న ప్రాయంలోనే ప్రియ ఆ బాధ్యతలు స్వీకరించి రికార్డులకెక్కారు. 
 
ఇకపోతే... ప్రియ భర్త రాజా ఓ ప్రైవేటు కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. రాష్ట్రంలోని మొత్తం 21 కార్పొరేషన్లలో 11 చోట్ల మహిళలే మేయర్లు కావడం మరో విశేషం.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు