కావలసిన పదార్థాలు : పుట్టగొడుగులు (మష్రూమ్స్).. 200 గ్రా. పనీర్.. 50 గ్రా. జీడిపప్పు.. గుప్పెడు బంగాళాదుంపలు.. రెండు పచ్చిమిర్చి.. నాలుగు ఉప్పు.. తగినంత కొత్తిమీర.. ఒక కట్ట నిమ్మకాయ.. ఒకటి
తయారీ విధానం : పుట్టగొడుగుల్ని శుభ్రం చేసి ఉడికించి తీయాలి. గొడుగులకు రంధ్రం పడకుండా కాడను జాగ్రత్తగా తొలగించాలి. బంగాళాదుంపల్ని ఉడికించి పొట్టు తీసి మెత్తగా చిదమాలి. అందులోనే పనీర్ తురుము, జీడిపప్పు ముక్కలు, కొత్తిమీర, ఉప్పు, నిమ్మరసం కలపాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని గొడుగుల్లో జాగ్రత్తగా నింపి, వాటిని అలాగే ఓవెన్లో ఉంచి ఓ రెండు నిమిషాలు గ్రిల్ చేయాలి. అంతే స్టఫ్డ్ మష్రూమ్స్ రెడీ..! ఇవి వానాకాలంలో స్నాక్స్లా తినడానికి రుచిగా ఉంటాయి, ఆరోగ్యానికి మంచిది కూడా..!!