భారత్‌లో కరోనా విజృంభణ, 24 గంటల్లో కొత్తగా 78,512 పాజిటివ్ కేసులు

సోమవారం, 31 ఆగస్టు 2020 (11:28 IST)
భారత్‌లో కరోనా ఉగ్ర రూపాన్ని దాలుస్తుంది. కరోనా మహమ్మారి వ్యాప్తి రోజురోజుకు పెరిగిపోతున్నది. వివిధ రాష్ట్రాల నుండి కొత్త కేసులు పెరిగిపోతున్నాయి. దేశంలో కేసుల సంఖ్య 36 లక్షల 21 వేలకు దాటింది. గడిచిన 24 గంటల్లో భారత్‌లో 78,512 కేసులు నమోద కాగా 971 మంది ప్రాణాలు కోల్పోయారు. 
 
దేశ వ్యాప్తంగా 60,868 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. దేశంలో మొత్తం 36,21,245 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 7,81,975 ఉండగా 27,74,801 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఇదిలా ఉండగా 64,449 మంది కరోనా వ్యాధితో మరణించారకు.
 
ప్రస్తుతం దేశంలో కరోనా బాధితుల రికవరీ రేటు 76.61 శాతంగా ఉండగా దేశంలో మొత్తం నమోదైన కేసులో 1.79 శాతానికి మరణాల రేటు తగ్గింది. దేశంలో నమోదైన మొత్తం కేసులలో యాక్టివ్ కేసుల శాతం 21.60 శాతంగా ఉంది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 8,46,278 మందికి కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ఇప్పటివరకు దేశంలో 4,23,07,914 కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు.
 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు