ఒమిక్రాన్: షిరిడీలోని సాయిబాబా మందిరం మూసివేత

సోమవారం, 27 డిశెంబరు 2021 (15:13 IST)
ఒమిక్రాన్ నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాల ప్రకారం షిరిడీలోని ప్రసిద్ధ సాయిబాబా మందిరం మూసివేస్తున్నట్లు సంస్థాన్ వెల్లడించింది. కర్ఫ్యూ సమయాల్లో సాయిబాబా ఆలయాన్ని మూసివేయనున్నారని శ్రీ సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ సీఈవో భాగ్యశ్రీ తెలిపారు. ఆలయంలోని అన్ని సౌకర్యాలు కూడా మూసివేస్తామని భక్తులు దీనిని దృష్టిలో ఉంచుకోవాలని సూచించింది సంస్థాన్.
 
ఒమిక్రాన్ విజృంభిస్తున్న నేపథ్యంలో మహారాష్ట్రలో.. ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వం ఆంక్షలు అమలు చేస్తూ.. మార్గదర్శకాలను విడుదల చేసింది. 25వ తేదీ రాత్రి 9 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకూ రాత్రిపూట కర్ఫ్యూ విధించింది ప్రభుత్వం. వివాహ వేడుకల్లో కేవలం 100 మంది మాత్రమే హాజరు కావాలని కూడా ఆదేశాలు జారీ చేసింది. 50 శాతం సామర్థ్యంతో థియేటర్లు, హోటళ్లకు అనుమతులు ఇచ్చింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు