దేశంలో పెరిగిన రికవరీ కేసులు.. ప్రపంచంలో అతి కొద్దిమంది మాత్రమే..?

సోమవారం, 15 ఫిబ్రవరి 2021 (12:08 IST)
భారత దేశంలో కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టింది. ప్రపంచాన్ని గజగజలాడిస్తున్న కరోనా మహమ్మారిని భారత్ బలంగానే ఎదుర్కొందని కేంద్ర ఆరోగ్య శాఖ అంటోంది. ఇప్పటి వరకూ దేశంలో నమోదైన కరోనా కేసుల్లో 97.31శాతం మంది కోలుకున్నారని ఆదివారం వెల్లడించింది. ఇంత రికవరీ రేటు సాధించిన దేశాలు ప్రపంచంలో అతి కొద్దిగా మాత్రమే ఉన్నాయని ప్రభుత్వం అంటోంది. 
 
గతేడాది అక్టోబరు 1 నుంచి దేశంలో కరోనా మరణాల సంఖ్య తగ్గుతూనే వచ్చిందని తెలిపిన ఆరోగ్య శాఖ.. ఆదివారం నాటికి ఇది కేవలం 1.43 శాతమే ఉందని పేర్కొంది. కరోనా మరణాల రేటు అత్యంత తక్కువగా ఉన్న దేశాల్లో భారత్ ఒకటని వివరించింది. 
 
ఈ మహమ్మారి ధాటికి అగ్రరాజ్యం అమెరికా కూడా అల్లాడిపోయిన సంగతి తెలిసిందే. యూఎస్‌లో సుమారు 5 లక్షల మంది కరోనాకు బలయ్యారు. అమెరికాతో పోల్చుకుంటే మన దేశంలో కరోనా మరణాలు సగానికంటే తక్కువని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు