తిరుపతిలోని మాల్‌లో గుంపులు గుంపులుగా జనం, నో మాస్క్, నో డిస్టెన్స్

బుధవారం, 28 జులై 2021 (18:31 IST)
తిరుపతిలో కరోనాను పూర్తిగా మర్చిపోయారు నగర వాసులు. ఎక్కడా మాస్కులు, భౌతిక దూరం కనిపించలేదు. దీంతో తిరుపతి నగరంలో కేసుల సంఖ్య అమాంతం పెరిగిపోయిందని స్వయంగా నగర పాలక కమిషనర్ గిరీషా తెలిపారు. 1.5 శాతం ఉన్న కరోనా కేసులు 4 శాతంకు చేరిందన్నారు.
 
గత మూడు రోజుల నుంచి కేసుల సంఖ్య పెరుగుతోందని.. నిర్లక్ష్యంగా ఎవరూ వ్యవహరించవద్దన్నారు. ఉన్నట్లుండి నగర పాలకసంస్ధ కమిషనర్ తిరుపతి నగరంలోని పలు వస్త్ర దుకాణాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు.
 
సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో జనం గుంపులు గుంపులుగా ఉండడాన్ని గమనించారు గిరీషా. అస్సలు ఏమాత్రం మాస్కులు ధరించకుండా.. సామాజిక దూరాన్ని గాలికొదిలేసి దగ్గర దగ్గరగా గుంపులు గుంపులుగా ఉండడాన్ని చూసి ఆగ్రహం వ్యక్తం చేశారు.
 
నిర్వాహకులకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. 50 వేల రూపాయల జరిమానా విధించారు గిరీషా. కలెక్టర్ దృష్టికి వెళితే షాపును పూర్తిగా క్లోజ్ చేస్తామని హెచ్చరించారు. తాత్కాలికంగా షాపింగ్ మాల్‌ను మూసివేశారు. అలాగే మరికొన్ని షాపింగ్ మాల్స్‌ను పరిశీలించిన కమిషనర్ నిర్వాహకులకు పలు సూచనలు చేశారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు