దేశంలో కొనసాగుతున్న కరోనా ఉధృతి - కొత్తగా 63 వేల కేసులు

ఆదివారం, 16 ఆగస్టు 2020 (10:31 IST)
దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. దేశంలో గడచిన 24 గంటల్లో 63,489 మందికి కరోనా సోకిందని, అదేసమయంలో 944 మంది మృతి చెందారని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది.
 
దేశంలో కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 25,89,682కు చేరగా, మృతుల సంఖ్య మొత్తం 49,980 కి పెరిగింది. ఇక 6,77,444 మందికి ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 18,62,258 మంది కోలుకున్నారు.
 
అలాగే, తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఆదివారం ఉదయం వెల్లడించిన వివరాల ప్రకారం.. రాష్ట్రంలో కొత్తగా 1,102 మందికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. అదేసమయంలో 9 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోగా, 1,930  మంది కోలుకున్నారు.
 
ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 91,361కు చేరింది. ఆసుపత్రుల్లో 22, 542 మందికి చికిత్స అందుతోంది. ఇప్పటివరకు  68,126 మంది డిశ్చార్జ్ అయ్యారు. మృతుల సంఖ్య మొత్తం 693కి చేరింది. జీహెచ్‌ఎంసీలో 234 మందికి కొత్తగా కరోనా సోకింది. రంగారెడ్డి జిల్లాలో కొత్తగా 81 కేసులు నమోదయ్యాయి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు