చాంపియన్స్ ట్రోఫీ : 14వ సారి టాస్ ఓడిన భారత్... ఆసీస్ బ్యాటింగ్

ఠాగూర్

మంగళవారం, 4 మార్చి 2025 (14:19 IST)
చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా మంగళవారం తొలి సెమీ ఫైనల్ మ్యాచ్ జరుగనుంది. భారత్, ఆస్ట్రేలియా జట్లు తలపడే ఈ మ్యాచ్‌ కోసం టాస్ వేశారు. ఇందులో భారత జట్టు 14వ సారి టాస్ ఓడిపోయింది. కెప్టెన్‌గా ఇది రోహిత్ శర్మకు 11వ సారి కావడం గమనారంహం. ఈ మ్యాచ్‌లో టాస్ నెగ్గిన ఆస్ట్రేలియా భారత్‌ను బాలింగ్‌కు ఆహ్వానించి, బ్యాటింగ్‌కు దిగింది. ఈ మ్యాచ్ కోసం ప్రకటించిన భారత జట్టులో ఎలాంటి మార్పులు చేయలేదు. 
 
భారత తుది జట్టు : రోహిత్ శర్మ, గిల్, కోహ్లి, శ్రేయాస్ అయ్యర్, అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్, హార్జిక్ పాండ్యా, జడేజా, షమీ, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి. 
 
ఆస్ట్రేలియా తుది జట్టు... కూపర్, ట్రావిడ్ హెడ్, స్టీవెన్ స్మిత్, మార్నస్, జోష్ ఇంగ్లిస్, అలెక్స్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, బెన్ డ్వార్షి, నాథన్ ఎల్లిస్, ఆడమ్ జంపా, తన్వీర్ సంఘ
 
మరోవైపు, ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా దిగ్గజ మాజీ క్రికెటర్ రికీ పాంటింగ్ స్పందిస్తూ, సెమీస్‌ పోటీలో తాను భారత్‌ను ఫేవరేట్‌గా పరిగణిస్తున్నట్టు చెప్పారు. కానీ, కీలకమైన మ్యాచ్‌లో ఆస్ట్రేలియాను ఏమాత్రం తక్కువ అంచనా వేయలేమన్నారు. ఈ గేమ్‌ను భారత్ ఫేవరేట్‌గానే మొదలుపెట్టింది. ఎందుకంటే వారు ఎక్కడికీ ప్రయాణించలేదు. ఈ వికెట్‌పైనే సాధన చేశారు. కానీ, ఆస్ట్రేలియా మాత్రం హడావుడిగా దుబాయ్‌కు చేరుకుంది. వాతావరణ పరిస్థితులపై పెద్దగా అవగాహన లేదని భావిస్తాను అని చెప్పారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు