ప్రతిష్టాత్మక రియో ఒలింపిక్స్లో భారత్కు రెండో పతకాన్ని ఖరారు చేసిన భారత స్టార్ క్రీడాకారిణి, తెలుగమ్మాయి పీవీ సింధుకు ఖరీదైన కానుకలు అందనున్నాయి. గురువారం రాత్రి రియోలో బాడ్మింటన్ మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో సత్తా చాటిన సింధు.. తన ప్రత్యర్థిపై విజయం సాధించి ఫైనల్ చేరిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సింధు ధీటుగా రాణించి పతకం కైవసం చేసుకుంటే.. ఆమెకు ప్రశంసలతో పాటు కానుకల వర్షం కురిపించేందుకు స్పాన్సర్లు రెఢీ అవుతున్నారు.
ఈ మ్యాచ్లో సింధు విజయం సాధించిన వెంటనే అక్కడే ఉన్న తెలంగాణ బ్యాడ్మింటన్ సంఘం ఉపాధ్యక్షుడు.. ఇండియన్ బ్యాడ్మింటన్ లీగ్లో ముంబై మాస్టర్స్ ఫ్రాంచైజీ సహ యజమాని చాముండేశ్వరీనాథ్ ఆమెకు ఖరీదైన గిప్ట్ను ప్రకటించారు. ఇండియాకి మరో పతకం ఖరారు చేసిన సింధుకు రూ.60 లక్షల విలువ చేసే బీఎండబ్ల్యూ కారును బహుమతిగా ఇవ్వనున్నట్లు చాముండి ప్రకటించారు.