మహిళా ప్రపంచకప్... హర్మన్‌ప్రీత్ కౌర్ 171 నాటౌట్, ఇండియా 281

గురువారం, 20 జులై 2017 (21:35 IST)
మ‌హిళల వ‌రల్డ్‌క‌ప్ సెమీస్‌లో భాగంగా భారత జట్టు ఆస్ట్రేలియా జట్టుతో తలపడింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భార‌త జట్టులో హర్మన్ ప్రీత్ కౌర్ దూకుడుగా ఆడి 115 బంతుల్లో 171 పరుగులు సాధించి నాటవుట్‌గా నిలిచింది.. వ‌ర్షం కార‌ణంగా ఈ మ్యాచ్ మూడు గంట‌ల‌కుపైగా ఆల‌స్యమవడంతో మ్యాచ్‌ను 42 ఓవ‌ర్ల‌కు కుదించారు. 
 
ఇకపోతే జట్టులో మంధన 6 పరుగులు, రౌత్ 14 పరుగులు, మిథాలీ రాజ్ 36, డి.బి శర్మ 25 పరుగులు, వి. కృష్ణమూర్తి 16 పరుగులు చేశారు.

వెబ్దునియా పై చదవండి