పెద్ద పెద్ద మీసాలతో... న్యూ లుక్‌లో ఎంఎస్. ధోనీ

సోమవారం, 21 జూన్ 2021 (15:26 IST)
భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ ఎం.ఎస్.ధోనీ ఏ పని చేసినా అది సంచలనమే అవుతోంది. ఆయన వెంట్రుకలు పెంచినా, మీసాలు తీసేసినా, గుండు గీయించుకున్నా, మీసాలు పెంచినా ఇలా వ్యక్తిగతంగా ఏ పని చేసినా అది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 
 
తాజాగా సరికొత్త లుక్‌లో కనిపించి ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యపరిచారు. ఐపీఎల్ త‌ప్ప మ‌రో క్రీడా పోటీల్లో ఆడకుండా ఇంటిపట్టునే ఉంటున్న ధోనీ... ప్ర‌స్తుతం త‌న టైమంతా ఫ్యామిలీతోనే గ‌డుపుతున్నాడు. అయితే ధోనీలాంటి క్రికెట‌ర్లు ఆడినా ఆడ‌క‌పోయినా ఏదో ఒక ర‌కంగా వార్త‌ల్లో నిలుస్తుంటారు.
 
ఇపుడు కొత్త లుక్‌లో కనిపించారు. దీంతో మరోమారు వార్త‌లకెక్కారు. హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌లో లాక్డౌన్ ఎత్తేసిన త‌ర్వాత ఫ్యామిలీతో క‌లిసి షిమ్లా వెళ్లిన ధోనీ ఈ కొత్త లుక్‌లో క‌నిపించి ఆశ్చ‌ర్య‌ప‌రిచాడు. పెద్ద పెద్ద మీసాల‌తో అత‌డు పూర్తి డిఫ‌రెంట్‌గా క‌నిపిస్తున్నాడు. 
 
పైగా అక్క‌డి సాంప్ర‌దాయ టోపీ పెట్టుకొని క‌నిపించ‌డంతో ఆ ఫొటో మ‌రింత వైర‌ల్ అయింది. అత‌డు మీసాల‌తో క‌నిపించిన ఫొటోల‌ను మిస్ట‌ర్ కూల్ అభిమానులు ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు