తొలి ఇన్నింగ్స్లో (4/88), రెండో ఇన్నింగ్స్లో (6/99) ప్రదర్శన చేసి భారత్ విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఇంగ్లండ్లో అతడికిది తొలి టెస్టు మ్యాచ్ కావడం విశేషం. మ్యాచ్ తర్వాత ఆకాశ్ దీప్ విలేకరులతో మాట్లాడుతూ, తన ప్రదర్శనను కేన్సర్తో బాధపడుతున్న సోదరికి అంకితమిస్తున్నట్లు తెలిపాడు.
మరోవైపు, రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్లో ఇంగ్లాండ్ 407 పరుగులకు ఆలౌట్ అయింది. సిరాజ్ 6, ఆకాశ్ 4 వికెట్లు పడగొట్టారు. షోయబ్ బషీర్ను ఔట్ చేసి సిరాజ్ ఆరో వికెట్ ఖాతాలో వేసుకున్నాడు. అయితే, ఈ వికెట్ పడగొట్టడానికి ముందు ఆకాశష్కు ఐదు వికెట్ల ఘనత సాధించే అవకాశముంది.
దీంతో ఐదో వికెట్ తీసే ఛాన్స్ ఇస్తానని ఆకాశ్తో చెప్పినట్టు సిరాజ్ తెలిపాడు. అందుకు ఆకాశ్.. 'వద్దు భయ్యా.. నువ్వు వికెట్ తీసుకో.. ఒకవేళ నాకు రాసిపెట్టి ఉంటే ఆ వికెట్ నాకే దక్కుతుంది' అని అని పేర్కొన్నాడట. అయితే, రెండో ఇన్నింగ్స్లో ఆకాశ్ ఐదు వికెట్ల కల నెరవేరింది.