అహ్మదాబాద్ వన్డే.. సెంచరీ చేసిన గిల్.. అరుదైన రికార్డు సొంతం

ఠాగూర్

బుధవారం, 12 ఫిబ్రవరి 2025 (16:47 IST)
అహ్మదాబాద్ వేదికగా భారత్, ఇంగ్లండ్ క్రికెట్ జట్ల మధ్య మూడో వన్డే డే అండ్ నైట్ మ్యాచ్ బుధవారం జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో భారత ఓపెనర్ శుభమన్ గిల్ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు వన్డేల్లో అత్యంత వేగంగా 2500 పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌గా రికార్డు సృష్టించారు. కేవలం 50 ఇన్నింగ్స్‌లలోనే గిల్ ఈ అరుదైన మైలురాయిని సొంతం చేసుకున్నాడు. 
 
ఇలాంటి అరుదైన రికార్డు క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీకిసైతం సాధ్యంకాకపోవడం గమనార్హం. ఈ మ్యాచ్‌లో గిల్ మొత్తం 102 బంతులు ఎదుర్కొన్న గిల్ మూడు ఫోర్లు, 14 ఫోర్ల సాయంతో 112 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. 
 
ఇకపోతే, ఈ మ్యాచ్‌లో భారత జట్టు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగింది. ఓపెనర్‌గా వచ్చిన రోహిత్ శర్మ ఒక్క పరుగు చేసి ఔట్ అయ్యాడు. రెండో మ్యాచ్‌లో సెంచరీతో ఆకట్టుకోగా, ఈ మ్యాచ్‌లో మరోమారు విఫలమయ్యాడు. విరాట్ కోహ్లీ 52, శ్రేయాస్ అయ్యర్ 78, రాహుల్ 21 (నాటౌట్), పాండ్యా 17, పటేల్ 13, సుందర్ ఒక్క పరుగుతో క్రీజ్‌లో ఉన్నారు. ప్రస్తుతం భారత్ 44 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 308 పరుగులు చేసింది.

 

Jubilation as @ShubmanGill gets to a fine CENTURY!

Keep at it, young man ????????

Live - https://t.co/S88KfhFzri#INDvENG@IDFCFIRSTBank pic.twitter.com/Xbcy6uaO6J

— BCCI (@BCCI) February 12, 2025

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు