ఇంగ్లండ్తో జరుగుతున్న నాలుగో టెస్టులో భారత్ విజయం ఖాయమయ్యేలా ఉంది. మ్యాచ్తో పటు, సిరీస్ను గెలుచుకోవడం కోహ్లీ సేనకు తేలికే కానుంది. భారత్తో జరుగుతున్న నాలుగో టెస్ట్ సెకండ్ ఇన్నింగ్స్లో ఇంగ్లండ్ జట్టు ఇంకా 49 పరుగులు మాత్రమే వెనకబడి ఉంది.
సుమారు 90 ఓవర్ల పాటు జరగాల్సిన ఆఖరి రోజు ఆట మిగిలి ఉండటంతో మ్యాచ్ కోల్పోకుండా ఉండాలంటే కుక్ సేన సాధ్యమైనన్ని ఓవర్ల పాటు వికెట్ కోల్పోకుండా అసలు సిసలైన టెస్ట్ బ్యాటింగ్ చెయ్యాల్సి ఉంటుంది. కానీ ఈ లోపు ఇంగ్లండ్ను ఆలౌట్ చేయడం పెద్ద కష్టమేమీ కాదు. ఆపై సెకండ్ ఇన్నింగ్స్ కూడా ఆడాల్సి వస్తే ఆ కొద్దిపాటి పరుగులను కూడా ఛేదించి కోహ్లీసేన సీరీస్ను కైవసం చేసుకుంటుందని క్రికెట్ పండితులు జోస్యం చెప్తున్నారు.