ఆస్ట్రేలియాను వైట్ వాష్ చేసి ఆ జట్టుకు మరిచిపోలేని స్ట్రోక్ ఇచ్చామని దక్షిణాఫ్రికా కెప్టెన్ డు ప్లెసిస్ తెలిపాడు. ఇటీవల జరిగిన ఐదు వన్డేల సిరీస్లో అత్యద్భుతంగా ఆడామని తెలిపారు. ఆసీస్కు ఆ సిరీస్ చాలాకాలం గుర్తుండిపోయే చేదు జ్ఞాపకంగా మిగిలిపోతుందని పేర్కొన్నాడు. తమ దేశంలో జరిగిన సిరీస్ లో ఆసీస్ అలా ఓడిపోవడం ఆ జట్టును మానసికంగా బలహీనపరుస్తుందనడంలో ఎలాంటి అనుమానం లేదన్నాడు.